Palasa: పలాస వెళ్తున్న అచ్చెన్న, రామ్మోహన్‌ నాయుడును అడ్డుకున్న పోలీసులు

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బెండి గేట్ వద్ద తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, చౌదరి బాబ్జీలను పోలీసులు అడ్డుకున్నారు. ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు పలాస వెళ్తున్నామని.. ఎందుకు అడ్డుకుంటున్నారని.. పోలీసులతో తెదేపా కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. అచ్చెన్నాయుడు కూడా వివాహానికే వెళ్తున్నామని పోలీసులకు చెప్పారు. దీంతో అచ్చెన్నాయుడు వాహనంలో సీఐ రాము కూర్చుని.. కల్యాణ మండపం వద్ద దించారు. కళ్యాణ మండపం వద్ద పోలీసులు పహారా కాశారు.

Published : 21 Aug 2022 11:26 IST
Tags :

మరిన్ని