Kajal: తిరుమల శ్రీవారి సేవలో నటి కాజల్ అగర్వాల్ దంపతులు
తిరుమల శ్రీవారిని నటి కాజల్ అగర్వాల్ దంపతులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో వారు పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో కాజల్ మాట్లాడుతూ.. తన భర్తతో తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.
Published : 26 Sep 2022 10:03 IST
Tags :