Keerthy Suresh: తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి కీర్తి సురేశ్

తిరుమల (Tirumala) శ్రీవారిని సినీ నటి కీర్తి సురేశ్ (Keerthy Suresh) దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న ఆమెకు రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Published : 27 May 2023 15:28 IST

Tags :

మరిన్ని