Shriya Saran: తిరుమల శ్రీవారి సేవలో నటి శ్రియ

తిరుమల (Tirumala) శ్రీవారిని సినీ నటి శ్రియా శరణ్‌ (Shriya Saran) దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె తన తల్లితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే (TTD) ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. 

Published : 02 Apr 2023 16:21 IST
Tags :

మరిన్ని