Adani: 5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొననున్న అదానీ గ్రూప్‌

టెలికాం రంగంలోకి అదానీ గ్రూప్ ప్రవేశిస్తోందంటూ వచ్చిన వార్తలపై ఆ సంస్థ స్పందించింది. 5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకోవడం నిజమేనని ధ్రువీకరించింది. అయితే  వినియోగదారులకు నేరుగా సేవలందించే ఉద్దేశంతో కాదని స్పష్టం చేసింది. విమానశ్రయాల నుంచి విద్యుత్, డేటా కేంద్రాల వరకు ఉన్న తమ వ్యాపారాలకు ప్రైవేటు నెట్‌వర్క్ మద్దతు సృష్టించేందుకే 5జీ స్ట్పెక్ట్రం వేలంలోకి వస్తున్నట్లు అదానీ గ్రూప్ ఓ ప్రకటనలో పేర్కొంది.

Published : 10 Jul 2022 15:02 IST
Tags :

మరిన్ని