Vakkantham Vamsi: ‘నా పేరు సూర్య’.. తారక్‌తో చేయాల్సిన చిత్రం : వక్కంతం వంశీ

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ కథను మొదట ఎన్టీఆర్‌తో చేయాలనుకున్నట్లు ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ చెప్పారు. తన సతీమణి, ‘ఆట’ ఫేమ్‌ శ్రీవిద్యతో కలిసి ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన కెరీర్‌ గురించి ఎన్నో ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ‘‘నా జీవితంలో ఒక రచయితగా మంచి గుర్తింపు అందుకున్న చిత్రం ‘కిక్‌’. ‘నా పేరు సూర్య’ ఒరిజినల్‌గా తారక్‌తో చేయాల్సిన చిత్రం. ఆయనే నన్ను దర్శకుడిని చేస్తానని చెప్పారు.

Published : 16 Nov 2022 11:21 IST

Tags :

మరిన్ని