Nara Lokesh: లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రకు సర్వం సిద్ధం
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 25న హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించి.. మధ్యాహ్నం కడప అమీన్ పీర్ దర్గా, రోమన్ క్యాథలిక్ చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేసి రాత్రికి తిరుమల చేరుకోనున్నారు. 26 ఉదయం శ్రీవారి దర్శనానంతరం.. లోకేశ్ కుప్పంకు బయలుదేరనున్నారు. 27న యువగళం పాదయాత్ర అనంతరం.. కుప్పంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి.
Published : 24 Jan 2023 20:06 IST
Tags :