Amara Raja : వైకాపా ప్రభుత్వ వేధింపులు భరించలేక తరలిపోయిన దిగ్గజ సంస్థ.!

వైకాపా వేధింపులకు మరో దిగ్గజ పారిశ్రామిక సంస్థ పక్క రాష్ట్రానికి తరలిపోయింది. కక్ష సాధింపు చర్యలు తట్టుకోలేక తెలంగాణకు వెళ్లిపోయింది. తెలుగుదేశం ఎంపీకి చెందిందన్న ఏకైక కారణంతో వేధింపులు పెచ్చుమీరడంతో అమరరాజా బ్యాటరీస్ రాష్ట్రంలో విస్తరణ పనులు నిలిపివేసింది. ఏకంగా 9వేల 500 కోట్ల పెట్టుబడితో తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో కొత్త ప్లాంట్ ఏర్పాటుకు  అక్కడి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 

Updated : 03 Dec 2022 12:47 IST

Tags :

మరిన్ని