Ambulance Mafia: తిరుపతి జిల్లాలో రెచ్చిపోయిన అంబులెన్స్ మాఫియా..!
తిరుపతి జిల్లా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రైవేట్ అంబులెన్స్ మాఫియా రెచ్చిపోయింది. ఓ యువకుడి మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి తీసుకెళ్లకుండా అడ్డుకోవడం తీవ్ర కలకలం రేపింది. తాము చెప్పిన ధరకు.. తమ అంబులెన్సులోనే తీసుకెళ్లాలని అంబులెన్స్ డ్రైవర్లు పట్టుబట్టారు. బయటి నుంచి తెచ్చుకున్న వాహనాన్ని అనుమతించేది లేదంటూ అమానవీయంగా ప్రవర్తించారు. చనిపోయిన యువకుడి కుటుంబసభ్యులు ఎంత బతిమాలినా అంగీకరించలేదు. కేవలం 17 కిలోమీటర్ల దూరానికి రూ.4వేలు ఇవ్వాల్సిందేనని తేచ్చిచెప్పారు. బయటి నుంచి వచ్చిన వాహన డ్రైవర్ పై దాడికి తెగబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆసుపత్రి వద్దకు చేరుకుని ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్ల చర్యలను అడ్డగించారు. బాధితులు తెచ్చుకున్న వాహనంలో తీసుకెళ్లేలా సహకరించారు.
Published : 21 Sep 2022 16:01 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా