Anakapalli: రాజసం కాదిది.. అక్షరం కోసం ఆదివాసీ బిడ్డల ప్రయాస

అనకాపల్లి జిల్లాలోని చీమలపాడు పంచాయతీలోని నేరేడు బంధ అటవీ ప్రాంతంలో గిరిజన విద్యార్థులు... పాఠశాలకు వెళ్లేందుకు రహదారి సదుపాయం లేక గుర్రాలపై వెళుతున్నారు. వీరు చదువుకోడానికి ఎత్తైన కొండలు, గుట్టలు, తుప్పలు దాటి  5 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోగంపేట పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. కనీసం అంగన్వాడి కేంద్రం కూడా లేని తమ ప్రాంతంలో రోడ్లు, పాఠశాలను నిర్మించాలని అధికారులను గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు.  

Updated : 12 Jan 2023 17:28 IST
Tags :

మరిన్ని