AP News: పంటబీమా పరిహారంపై అనంతపురం రైతు న్యాయ పోరాటం
పంటల బీమా పరిహారం అందించడంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఓ రైతు లోకాయుక్తను ఆశ్రయించడం అధికారుల్లో అలజడి రేకెత్తిస్తోంది. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా స్పందించపోవడంతో రాజకీయ నాయకులు, అధికారులు కలిసి అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆ రైతు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. తనలాంటి బాధితులే చాలా మంది ఉన్నారని తెలుసుకుని వారి తరఫునా పోరాడుతున్నారు. తక్షణమే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని వ్యవసాయశాఖ కమిషనర్ను లోకాయుక్త న్యాయమూర్తి ఆదేశించగా.. ఆగమేఘాల మీద దర్యాప్తు చేస్తున్నారు.
Published : 02 Feb 2023 11:39 IST
Tags :