Anantapur: స్కేటింగ్ చేస్తూ కారు లాగిన పదో తరగతి విద్యార్థిని..!

అనంతపురానికి చెందిన నిత్యశ్రీ అనే 10వ తరగతి విద్యార్థిని 101 కిలోమీటర్ల మేర స్కేటింగ్ చేస్తూ కారును లాగింది. అనంతపురం-బెంగళూరు జాతీయ రహదారిపై సాగుతున్న స్కేటింగ్ యాత్రకు మాజీ మంత్రి పరిటాల సునీత స్వాగతం పలుకుతూ కొంత దూరం నిత్యశ్రీతో కలిసి నడిచారు. వజ్ర వరల్డ్ రికార్డు కోసం 101 కిలోమీటర్ల దూరం స్కేటింగ్ చేస్తూ నిత్యశ్రీ కారును లాగుతోందని నిర్వాహకులు తెలిపారు.

Updated : 26 Oct 2023 16:01 IST

Tags :

మరిన్ని