AP JAC: ఉద్యోగులకు ప్రభుత్వం అన్నీ ఇచ్చేసిందని చెప్పడం దుర్మార్గం: బొప్పరాజు

పీఆర్సీ అరియర్స్ ఉద్యోగ విరమణ తర్వాత తీసుకోమనడం దారుణమని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు మండిపడ్డారు. అనేక రకాల బకాయిలు ఉన్నప్పటికీ ఉద్యోగులకు ప్రభుత్వం అన్నీ ఇచ్చేసిందని మంత్రి బుగ్గన అసెంబ్లీలో చెప్పడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు  ‘వర్క్ టూ రూల్‌’పాటించాలని పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు మాత్రమే విధులు నిర్వహించాలని సూచించారు. ఆరోగ్య వర్సిటీలో ఉద్యోగులతో సమావేశమై ఉద్యమ కార్యాచరణపై చర్చించారు.

Published : 21 Mar 2023 17:46 IST
Tags :

మరిన్ని