APSRTC: ఆర్టీసీ కొత్త విధానం.. బస్సులు రెండైనా.. ఒకటే టికెట్‌

నేరుగా బస్సుల్లేని ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ(APSRTC) కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. ఒకే టికెట్‌తో రెండు బస్సుల్లో ప్రయాణించి గమ్యం చేరుకునే విధానం తీసుకువచ్చింది. ప్రయాణికులు తొలి బస్సు ఎక్కి.. మధ్యలో ఏదైనా ప్రాంతంలో దిగి పనులు చూసుకుని నిర్ణీత సమయంలో మరో బస్సు ఎక్కి గమ్యస్థానం చేరుకునే అవకాశం కల్పిస్తోంది. నూతన విధానం నేటి నుంచి 137 రూట్లలో అందుబాటులోకి తెచ్చిన ఆర్టీసీ దశలవారీగా అన్ని దూర ప్రాంత బస్సు మార్గాల్లో ఈ విధానాన్ని తీసుకురానున్నట్లు తెలిపింది.

Updated : 05 May 2023 13:32 IST

Tags :

మరిన్ని