Punjab: మద్యం మత్తులో బైక్‌ నడిపిన ఏఎస్‌ఐ..!

మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన ఓ పోలీసు అధికారి ప్రజల చేతిలో చీవాట్లు తిన్నాడు. ఈ ఘటన పంజాబ్‌లో జరిగింది. ఫతియాబాద్‌కు చెందిన ఏఎస్‌ఐ తప్పతాగి ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. తాగి వాహనం నడపడమే పెద్ద తప్పయితే.. ఆపై అతివేగంగా వాహనం నడిపి డివైడర్‌ను ఢీకొట్టాడు. అదృష్టవశాత్తు ఆయనకి పెద్ద ప్రమాదమేమీ జరగలేదు. లేచి మళ్లీ ద్విచక్ర వాహనంపై వెళ్లేందుకు ప్రయత్నించగా ప్రజలు వారించారు. తాగిన మత్తులో వాహనం నడుపొద్దంటూ బుద్ధి చెప్పారు.

Updated : 26 Oct 2023 15:47 IST

Tags :

మరిన్ని