Hyderabad: హయత్‌నగర్‌లో అర్ధరాత్రి రెచ్చిపోయిన ఆకతాయిలు.. డబ్బుల కోసం యువకుడిపై దాడి!

హైదరాబాద్ హయత్‌నగర్ (hayatnagar) పరిధిలో ఆకతాయిలు రెచ్చిపోయారు. డబ్బులు ఇవ్వాలంటూ.. ఓ యువకుడిని తీవ్రంగా కొట్టారు. రామోజీగ్రూప్‌ సంస్థలో పనిచేస్తున్న పవన్ కుమార్ సత్య సాయి అనే ఉద్యోగి విధులు ముగించుకుని రాత్రి 01.30 గంటల సమయంలో లెక్చరర్స్ కాలనీలోని తన ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆరుగురు వ్యక్తులు బైకుపై కూర్చొని.. అటుగా వెళ్తున్న పవన్ సాయిపై దాడి చేశారు. డబ్బులు ఇవ్వాలంటూ ముఖంపై పిడిగుద్దులు గుద్దారు. డబ్బులు లేవని చెప్పినా వినకుండా కొట్టి వెళ్లిపోయారు. హయత్ నగర్ పోలీసుస్టేషన్‌లో పవన్‌ ఫిర్యాదు చేశారు. 

Published : 07 Jun 2023 11:36 IST

Tags :

మరిన్ని