Bangalore: బదిలీ వేటు వేసినా.. ఆగని సివిల్‌ సర్వెంట్ల వివాదం

కర్ణాటకలో ఇద్దరు మహిళా సివిల్ సర్వెంట్ల మధ్య వివాదం.. చినికి చినికి గాలివానలా మారింది. IAS అధికారిణి రోహిణి సింధూరి, IPS అధికారిణి రూప పరస్పరం బహిరంగంగా తీవ్ర ఆరోపణలు చేసుకోవటంతో.. కర్ణాటక ప్రభుత్వం వారిపై బదిలీ వేటు వేసింది. బహిరంగ విమర్శలు చేసుకోవద్దని సూచించినా.. IPS అధికారిణి రూప ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. IAS అధికారిణి రోహిణి పరువునష్టం దావా వేయగా.. ఆమెకు పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేయవద్దని కోర్టు రూపను ఆదేశించింది. 

Updated : 23 Feb 2023 20:31 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు