Viral Video: వందే భారత్‌ రైల్లో ‘వందేమాతరం’.. విద్యార్థి సమ్మోహన వేణుగానం

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ఓ విద్యార్థి ఫ్లూట్‌పై అద్భుతంగా ‘వందేమాతరం’ గేయం ఆలపించి అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాడు. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా మోదీ ప్రారంభించిన చెన్నై-మైసూరు వందేభారత్‌ రైల్లో ఈ అపురూప సన్నివేశం చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన అప్రమేయ శేషాద్రి అనే కాలేజీ విద్యార్థి.. రైల్లో ప్రయాణిస్తూ ఫ్లూట్‌పై ‘వందేమాతరం’ ఆలపించాడు. తోటి ప్రయాణికులు ఆ మధుర గానాన్ని ఆస్వాదిస్తుండగా.. వారిలో ఒకరు వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోను రైల్వే ఉద్యోగి ఒకరు షేర్‌ చేసి ఆ యువకుడిని ప్రశంసించారు. ఈ వీడియో తాజాగా నెట్టింట వైరల్ అయ్యింది. 

Published : 12 Nov 2022 15:22 IST

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ఓ విద్యార్థి ఫ్లూట్‌పై అద్భుతంగా ‘వందేమాతరం’ గేయం ఆలపించి అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాడు. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా మోదీ ప్రారంభించిన చెన్నై-మైసూరు వందేభారత్‌ రైల్లో ఈ అపురూప సన్నివేశం చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన అప్రమేయ శేషాద్రి అనే కాలేజీ విద్యార్థి.. రైల్లో ప్రయాణిస్తూ ఫ్లూట్‌పై ‘వందేమాతరం’ ఆలపించాడు. తోటి ప్రయాణికులు ఆ మధుర గానాన్ని ఆస్వాదిస్తుండగా.. వారిలో ఒకరు వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోను రైల్వే ఉద్యోగి ఒకరు షేర్‌ చేసి ఆ యువకుడిని ప్రశంసించారు. ఈ వీడియో తాజాగా నెట్టింట వైరల్ అయ్యింది. 

Tags :

మరిన్ని