Bhupalpally: చేపలు పట్టే యంత్రం.. ఇది నాలుగో తరగతి చదివిన వ్యక్తి ఆవిష్కరణ

అతను చదువుకున్నది నాలుగో తరగతే. కానీ, తాను తయారు చేసిన పరికరంతో వాగులో చేపలు పడుతూ ఉపాధి పొందడమే కాకుండా.. మరో నలుగురికి అవకాశం కల్పించాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన ముక్కెర చంద్రశేఖర్.. చిన్ననాటి నుంచే చిన్న చిన్న విద్యుత్‌ మరమ్మతులు చేస్తుండేవాడు. ఈ నేపథ్యంలో తమ గ్రామంలో చేపలు పట్టేందుకు ఇబ్బంది పడుతున్న వారిని చూసి.. ఏదైనా ఒక పరికరాన్ని తయారు చేయాలనుకున్నాడు. ఇంటర్నెట్‌ సహాయంతో ప్రతిభకు పదును పెట్టి.. బ్యాటరీ ద్వారా పనిచేసే పరికరాన్ని రూపొందించాడు.

Published : 23 Jan 2023 19:55 IST
Tags :

మరిన్ని