Bihar: పాఠాలు చెప్పలేదు.. జీతం నాకెందుకు?
‘‘కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతబడ్డాయి. ఆన్లైన్ క్లాసులు జరిగినప్పటికీ హాజరైంది అరకొరా విద్యార్థులే. పాఠాలేమీ చెప్పలేకపోయాను’’ అంటూ తన 33 నెలల వేతనాన్ని తిరిగిచ్చేశారు ఓ కాలేజీ ప్రొఫెసర్. విద్యార్థులకు పాఠాలు బోధించకుండా జీతం తీసుకొనేందుకు తన మనస్సాక్షి అంగీకరించలేదంటూ దాదాపు రూ.24లక్షలను వెనక్కి ఇచ్చేశారు. నిజాయతీకి నిలువుటద్దంగా నిలిచిన ఆయన పేరు లలన్ కుమార్. పనిచేసేది బిహార్ ముజఫర్పూర్లోని ఓ ప్రభుత్వ కళాశాలలో.
Published : 07 Jul 2022 18:44 IST
Tags :