Gorantla Madhav: వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌కు చేదు అనుభవం

అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు వచ్చిన వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో.. ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంబేడ్కర్ విగ్రహావిష్కరణను ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ లేరన్న సాకుతో వాయిదా వేయడంపై దళిత సంఘాల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ కూడలి వద్ద గోరంట్ల మాధవ్‌ను వారు నిలదీశారు. ఒక్కరి కోసం విగ్రహావిష్కరణ ఆపేస్తారా అంటూ ప్రశ్నించారు. దీంతో చేసేదేమీ లేక దళిత సంఘాల సభ్యులతోపాటు మాధవ్ నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

Updated : 06 Dec 2022 16:23 IST

అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు వచ్చిన వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో.. ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంబేడ్కర్ విగ్రహావిష్కరణను ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ లేరన్న సాకుతో వాయిదా వేయడంపై దళిత సంఘాల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ కూడలి వద్ద గోరంట్ల మాధవ్‌ను వారు నిలదీశారు. ఒక్కరి కోసం విగ్రహావిష్కరణ ఆపేస్తారా అంటూ ప్రశ్నించారు. దీంతో చేసేదేమీ లేక దళిత సంఘాల సభ్యులతోపాటు మాధవ్ నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

Tags :

మరిన్ని