Gorantla Madhav: వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్కు చేదు అనుభవం
అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు వచ్చిన వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్కు చేదు అనుభవం ఎదురైంది. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో.. ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంబేడ్కర్ విగ్రహావిష్కరణను ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ లేరన్న సాకుతో వాయిదా వేయడంపై దళిత సంఘాల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ కూడలి వద్ద గోరంట్ల మాధవ్ను వారు నిలదీశారు. ఒక్కరి కోసం విగ్రహావిష్కరణ ఆపేస్తారా అంటూ ప్రశ్నించారు. దీంతో చేసేదేమీ లేక దళిత సంఘాల సభ్యులతోపాటు మాధవ్ నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
Updated : 06 Dec 2022 16:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!