Eatela Rajender: ఆ విషయంలో భారాస ప్రభుత్వం పూర్తిగా విఫలం: ఈటల రాజేందర్

ధాన్యం కొనుగోళ్లలో భారాస (BRS) ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ (Eatela Rajender) విమర్శించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీలు, రైతు సంఘాలంటే చిన్నచూపని విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేయలేదని.. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు.

Published : 29 Apr 2023 16:46 IST

Tags :

మరిన్ని