Kishan Reddy: రైతులను వదిలేసి రాజకీయ పార్టీలకు కేసీఆర్ నిధులు ఇస్తున్నారు: కిషన్‌రెడ్డి

ముఖ్యమంత్రి నివాసం, సచివాలయ నిర్మాణాలు పూర్తి చేసిన కేసీఆర్‌కు.. పేదవాళ్లకు ఇల్లు నిర్మించి ఇవ్వాలన్న సృహ లేదని కేంద్రంమంత్రి విమర్శించారు. పంటల బీమా పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే పట్టించుకోవట్లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు. మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా భాజపా(BJP) కార్యాలయంలో నిర్వహించిన మహాజన్ సంపర్క్ అభియాన్ అవగాహన కార్యక్రమలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఏటా అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా.. కేసీఆర్ (KCR) రాష్ట్ర రైతులను వదిలేసి రాజకీయ పార్టీలకు నిధులు ఇస్తున్నారని విమర్శించారు. 

Published : 20 May 2023 17:06 IST
Tags :

మరిన్ని