Bonthu Rammohan: నాకు సీబీఐ నుంచి ఎలాంటి నోటీసులూ రాలేదు..! : బొంతు రామ్మోహన్‌

హైదారాబాద్: తనను సీబీఐ అరెస్టు చేసిందంటూ వస్తోన్న వార్తలను హైదరాబాద్ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఖండించారు. బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నాకు ఎలాంటి నోటీసులూ రాలేదు. ఎవరో వచ్చి ఫొటో దిగితే నాకేంటి సంబంధం? మీడియాలో వస్తున్న వార్తల్లో ఊహాగానాలు తప్ప ఎలాంటి నిజం లేదు. శ్రీనివాస్‌ అనే వ్యక్తిని ఒక ఫంక్షన్‌లో కలిశాను. ఆయనతో నాకు ఎలాంటి పరిచయం లేదు. మా ఇద్దరి మధ్య ఎలాంటి లావాదేవీలు జరగలేదు. ఏదైనా తప్పు చేస్తే అతన్ని విచారించాలి. ఫోన్ స్విచ్ఛాఫ్‌ వస్తే అరెస్టు చేసినట్లేనా?అనారోగ్యం కారణంగా ఫోన్‌ స్వచ్ఛాఫ్‌ చేశాను. సీబీఐ, ఈడీలకు తెలంగాణ నాయకులు భయపడరు’’ అని బొంతు రామ్మోహన్‌ తేల్చి చెప్పారు. 

Updated : 01 Dec 2022 11:48 IST
Tags :

మరిన్ని