BRS: ఐదంతస్తుల్లో ఏపీ భారాస రాష్ట్ర కార్యాలయం.. 21న ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ భారాస (BRS) రాష్ట్ర కార్యాలయం మే 21న ప్రారంభం కానుంది. గుంటూరు నుంచి మంగళగిరి వెళ్లే మార్గంలో.. ఐదంతస్తుల భవనంలో కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. భారాస ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ (Thota Chandrasekhar) కార్యాలయాన్ని ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ సమావేశాలకు రెండు అంతస్తులు, మిగిలిన వాటిల్లో కార్యాలయ సిబ్బంది, రాష్ట్ర నాయకుల గదులను తీర్చిదిద్దుతున్నారు. రెండ్రోజుల్లో ప్రారంభం కానున్న ఈ భవనానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. 

Published : 19 May 2023 18:02 IST

ఆంధ్రప్రదేశ్ భారాస (BRS) రాష్ట్ర కార్యాలయం మే 21న ప్రారంభం కానుంది. గుంటూరు నుంచి మంగళగిరి వెళ్లే మార్గంలో.. ఐదంతస్తుల భవనంలో కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. భారాస ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ (Thota Chandrasekhar) కార్యాలయాన్ని ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ సమావేశాలకు రెండు అంతస్తులు, మిగిలిన వాటిల్లో కార్యాలయ సిబ్బంది, రాష్ట్ర నాయకుల గదులను తీర్చిదిద్దుతున్నారు. రెండ్రోజుల్లో ప్రారంభం కానున్న ఈ భవనానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. 

Tags :

మరిన్ని