national: భారత్‌ భూభాగంలోకి వచ్చిన పాక్‌ బాలుడు.. తండ్రికి అప్పగించిన సైన్యం

దారి తప్పి భారత భూభాగంలోకి వచ్చిన..పాకిస్థాన్ కు చెందిన మూడేళ్ల బాలుడిని భారత సైన్యం అతడి తండ్రికి అప్పగించింది. ఈ ఘటన పంజాబ్ లోని అంతర్జాతీయ సరిహద్దు వద్దశుక్రవారం రాత్రి జరిగింది. పంజాబ్ లోని ఫిరోజ్ పుర్ సెక్టార్ లో అంతర్జాతీయ కంచె వద్ద ఏడుస్తున్న బాలుడిని.. BSF బలగాలు గుర్తించాయి. అప్పటికే ఆ బాలుడు  తన తండ్రి కోసం ఏడుస్తూ ఉండడాన్ని గమనించారు. వెంటనే అక్కడికి చేరుకునిబాలుడికి తినుబండారాలు, మంచినీరు అందించారు. 

Published : 02 Jul 2022 16:39 IST

Tags :

మరిన్ని