West Bengal: చెరువులో దాచిన 4.96 కిలోల బంగారం.. పట్టుబడిందిలా..!

బెంగాల్‌లోని ఉత్తర పరగణ జిల్లాలో బీఎస్‌ఎఫ్ దళాలు ₹2.5 కోట్లు విలువ చేసే 40 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఒక చెరువులో దాచిన బంగారాన్ని పట్టుకున్నారు. కొన్ని నెలల క్రితం ఓ వ్యక్తి చెరువు ద్వారా బంగారం స్మగ్లింగ్ ప్రయత్నించగా.. బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది పట్టుకున్నారు. అయితే, అతని దగ్గర ఏమి దొరక్కపోవడంతో పోలీసులు విడిచిపెట్టారు. నిందితుడు చెరువులో పెద్ద ఎత్తున బంగారాన్ని దాచి పెట్టాడని సమాచారం రావడంతో.. బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు నిర్వహించగా 40 బంగారు బిస్కెట్లు పట్టుబడ్డాయి.

Updated : 06 Mar 2023 21:56 IST

Tags :

మరిన్ని