Nellore: పింఛన్‌ తీసేస్తే మాకు మరో ఆదరవు లేదు.. నెల్లూరులో వృద్ధుల కన్నీరు

పింఛన్ తొలగిస్తారనే నోటీసులతో నెల్లూరు జిల్లా కార్పొరేషన్ కార్యాలయానికి బాధితులు వరుస కట్టారు. అన్ని అర్హతలున్నా తమ పింఛన్లు.. ఎందుకు తీసేశారని అధికారులను నిలదీశారు. ఎమ్మెల్యేల వద్దకూ బాధితులు పరుగులు తీస్తున్నారు. రెండ్రోజులుగా నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలోని బాధితులు, ఎమ్మెల్యే కోటంరెడ్డి చుట్టూ తిరుగుతుండగా.. ఇవాళ నగర ఎమ్మెల్యే అనిల్ వద్దకూ వెళ్లి మొరపెట్టుకున్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఫించను ఇవ్వాలని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.. ఆయా వార్డు సచివాలయాల సిబ్బందిని ఆదేశించారు.

Updated : 26 Dec 2022 19:10 IST

Tags :

మరిన్ని