Captain Miller: 1940ల నాటి ‘కెప్టెన్‌ మిల్లర్‌’

ధనుష్‌ (Dhanush) కథానాయకుడిగా అరుణ్‌ మాథేశ్వరన్‌ తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’. జి.శరవణన్‌, సాయి సిద్ధార్థ్‌ నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుల్‌ మోహన్‌ కథానాయిక. సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆదివారం ఈ చిత్రానికి సంబంధించి మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. 1930-40ల నేపథ్యంలో సాగే పీరియాడికల్‌ సినిమాగా దీన్ని తీర్చిదిద్దుతున్నట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

Published : 22 Jan 2023 17:57 IST
Tags :

మరిన్ని