IND Vs NZ: టీ20 క్రికెట్‌లో సెంచరీ ప్రత్యేకమే: సూర్యకుమార్‌ యాదవ్‌

టీ20 క్రికెట్‌లో సెంచరీ చాలా ప్రత్యేకమని, అదేవిధంగా చివరి వరకూ బ్యాటింగ్‌ చేయడమూ ముఖ్యమేనని టీమ్‌ఇండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో రెండో టీ20లో 18, 19వ ఓవరకు బ్యాటింగ్‌ చేయాలని హార్దిక్‌, తాను ముందే నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. ఈ మేరకు తనదైన ఆటతీరును బాగా ఎంజాయ్‌ చేస్తున్నట్లు సూర్య వెల్లడించాడు. కాగా, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో సూర్య అజేయ ఇన్నింగ్స్‌ (111*: 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లు)తో ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే.

Updated : 20 Nov 2022 22:01 IST

Tags :

మరిన్ని