Chinna Jeeyar: రాజకీయ పార్టీల తీరుపై చినజీయర్‌ స్వామి అసంతృప్తి

ప్రస్తుత రాజకీయ పార్టీల తీరుపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి (Chinna Jeeyar Swamy) అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలకు వేరువేరు సిద్ధాంతాలు ఉన్నప్పటికీ సమాజం బాగు కోసం పనిచేస్తాయని.. ఈ క్రమంలో వారి మధ్య ఆధిపత్య పోరు సహజంగానే ఉంటుందన్నారు. అయితే, తమ లక్ష్యాలను పక్కనపెట్టి వ్యక్తిగత దూషణలు చేసుకోవడం మంచిది కాదన్నారు. ప్రజల సంక్షేమం కోసం పార్టీలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ఇటీవల కేంద్రం పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

Published : 30 Jan 2023 18:21 IST

Tags :

మరిన్ని