Chiranjeevi: రెండు గ్రూపులు, వ్యక్తుల మధ్య తగాదాలు తీర్చడానికి ముందుకురాను: చిరంజీవి

రాజకీయ అరంగేట్రం సమయంలో తన ఆస్తులు, వ్యక్తిగత విషయాలపై ఎంతో మంది అభియోగాలు మోపినా.. సంయమనంగా ఉండటం వల్లే వాస్తవాలు తెలిశాయని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. నాడు తనను శత్రువుగా భావించే వారే నేడు స్నేహితులుగా మారారని తెలిపారు. తన తాజా చిత్రం ‘గాడ్‌ ఫాదర్’ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా మీడియాతో చిరు చిట్‌చాట్ నిర్వహించారు. సినీ పెద్దగా తన పేరును ప్రస్తావించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. చిత్ర పరిశ్రమకు ఎదైనా అవసరం ఉంటే భుజాం కాస్తాను తప్ప.. రెండు అసోసియేషన్ల మధ్య గొడవలకు, ఇద్దరు వ్యక్తుల మధ్య తగాదాలు తీర్చడానికి ముందుకురానని పునరుద్ఘాటించారు.

Published : 14 Oct 2022 17:46 IST
Tags :

మరిన్ని