CM Jagan: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం జగన్‌

తిరుమల పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్‌ మరోసారి శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంగళవారం రాత్రి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం.. బుధవారం ఉదయం మళ్లీ దర్శనం చేసుకున్నారు. అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం పరకామణి భవన సముదాయాన్ని జగన్‌ ప్రారంభించారు. 

Published : 28 Sep 2022 11:11 IST
Tags :

మరిన్ని