CM KCR: ఏ మాత్రం పొరపాటు చేసినా గోస పడతాం: సీఎం కేసీఆర్
దేశంలో జరిగే పరిణామాలపై గ్రామాల్లో, బస్తీల్లో చర్చ జరగాలని తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. టీవీలు, పేపర్లలో వార్తలు చూసి వదిలేయకుండా, ఆలోచించాలని సూచించారు. దేశాన్ని కులం, మతం పేరుతో విడదీసే ప్రయత్నం జరుగుతోందని.. సమాజంలో విద్వేషం పెచ్చరిల్లితే కోలుకోవడం చాలా కష్టమని పేర్కొన్నారు. ఏ మాత్రం పొరపాటు చేసినా గోస పడతామని చెప్పారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో ఈ మేరకు ఆయన మాట్లాడారు.
Published : 17 Aug 2022 17:48 IST
Tags :