CM KCR: బస్సులో సీఎం కేసీఆర్‌, మంత్రుల భోజనం.. స్వయంగా వడ్డించిన ఎర్రబెల్లి..!

వడగళ్ల వానలతో పంట నష్టపోయిన రైతుల్లో భరోసా నింపేందుకు సీఎం కేసీఆర్‌ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో పర్యటన ముగించుకొని మహబూబాబాద్‌ జిల్లాకు వెళ్లే సమయంలో మంత్రులు, అధికారులతో కలిసి బస్సులోనే కేసీఆర్ భోజనం చేశారు. మంత్రులు నిరంజన్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎంపీ జోగినపల్లి సంతోష్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి, స్మితా సబర్వాల్‌ తదితర అధికారులు సీఎం వెంట ఉన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వారందరికీ స్వయంగా వడ్డించారు.  

Published : 23 Mar 2023 16:49 IST

Tags :

మరిన్ని