RRR - CBI: ఎంపీ రఘురామపై సీఐడీ చిత్రహింస ఘటనలో కీలక మలుపు

సీఐడీ పోలీసులు ఎంపీ రఘురామకృష్ణరాజును చిత్రహింసకు గురిచేసిన ఘటనపై హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆరుగురు సీఐడీ అధికారులు, ఇద్దరు అధికారపార్టీ నేతల కాల్‌ డేటాను సేకరించి భద్రపరచాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. 2021 మే 14నుంచి 16వ తేదీ మధ్య మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, సీఐడీ అప్పటి డీజీ సునీల్‌కుమార్‌, డీఐజీ సునీల్‌నాయక్‌, సీఐడీ డీఎస్పీ విజయ్‌పాల్‌, సీఐడీ అధికారులు ఉమామహేశ్వరావు, పసుపులేటి సుబ్బారావు, సుబ్రహ్మణ్యంల కాల్‌డేటాను భద్రపరచాలని స్పష్టంచేసింది.

Published : 13 May 2023 10:39 IST

Tags :

మరిన్ని