Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ కమిటీల చిచ్చు.. తారస్థాయికి అసంతృప్తి జ్వాల!

రాష్ట్ర కాంగ్రెస్‌లో పీసీసీ కమిటీల ప్రకటన రగిల్చిన అసంతృప్తి జ్వాల తారస్థాయికి చేరింది. భట్టి నివాసంలో సమావేశమైన సీనియర్ నేతలు జంబో కమిటీ కూర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒరిజనల్ కాంగ్రెస్ నేతలకు అన్యాయం చేసి.. వలస వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను కాపాడుతున్న తమపై కోవర్టులు అంటూ సోషల్  మీడియాలో ముద్రవేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని ఏఐసీసీకి నివేదిస్తామని తెలిపారు.

Updated : 24 Mar 2023 15:34 IST
Tags :

మరిన్ని