Jaggareddy: ఏపీని మూడు రాష్ట్రాలుగా విడగొడితే.. ముగ్గురూ సీఎంలు కావచ్చు: జగన్‌ కుటుంబానికి జగ్గారెడ్డి చురక

వైయస్‌ షర్మిల.. తనను కేటీఆర్‌ కోవర్ట్‌ అని నిందించడం తగదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. షర్మిలకు తెలంగాణ సీఎం కావాలనే కోరిక ఉందని ఆరోపించారు. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయడం కంటే.. మూడు రాష్ట్రాలుగా విడగొడితే సరిపోతుందని ఎద్దేవా చేశారు. అలా చేస్తే.. జగన్‌, షర్మిల, విజయసాయిరెడ్డి.. ఒక్కో రాష్ట్రానికి సీఎం కావొచ్చని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందేలా చూడాలని సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఇంటెలిజెన్స్ పనితీరుపైనా జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 

Published : 27 Sep 2022 14:10 IST
Tags :

మరిన్ని