Hyderabad: హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర.. ముగ్గురు అరెస్టు

హైదరాబాద్ జంట నగరాల్లో విధ్వంసం సృష్టించేందుకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పథకం ప్రకారం అలజడి సృష్టించేందుకు.. కశ్మీర్ నుంచి గ్రనేడ్లను వారు నగరానికి తీసుకువచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. మూసారాంబాగ్‌వాసి అబ్దుల్ జాహెద్.. పాక్  ముష్కరులతో నిత్యం సంప్రదింపులు సాగిస్తున్నట్లు తేలింది. స్థానిక యువకులతో తరచుగా సమావేశమవుతూ వారికి ఆకట్టుకునేందుకు ఆర్ధిక సహకారం అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిఘా వర్గాలు నుంచి సమాచారం అందుకున్న పోలీసులు రహస్యంగా ఆపరేషన్ నిర్వహించి ముగ్గురిని పట్టుకున్నారు.

Updated : 05 Mar 2024 16:58 IST
Tags :

మరిన్ని