AP News: బాపట్ల జిల్లాలో వ్యక్తిపై బ్లేడుతో కానిస్టేబుల్ దాడి..!

బాపట్ల(Bapatla) జిల్లాలో ఓ కానిస్టేబుల్ వ్యక్తిపై దాడి చేసి చెవి కోసిన ఘటన కలకలం రేపింది. పిట్టలవానిపాలెం మండలం సంగుపాలెంకు చెందిన శ్రీనివాసరావుపై కానిస్టేబుల్ మహేష్ దాడికి పాల్పడ్డారని బాధితుడు శ్రీనివాసరావు భార్య సంకూరి కుమారి ఆరోపించారు. ఆసరా పథకం నగదు పంపిణికి సంబంధించి బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి నిర్వహించిన కార్యక్రమానికి మహిళా సంఘాల సభ్యులను సంగుపాలెం నుంచి తీసుకెళ్లినందుకు సర్పంచి శివకుమారి ఆగ్రహించారని చెప్పారు. దీనికి సంబంధించి వాగ్వాదం చోటుచేసుకోవడంతో సర్పంచ్ కుమారుడైన మహేష్ శ్రీనివాసరావుపై దాడి చేశారని తెలిపారు. 

Published : 29 Mar 2023 14:01 IST

Tags :

మరిన్ని