Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటన.. కుట్ర కోణంపై దర్యాప్తు ముమ్మరం!

ఒడిశాలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. త్వరలోనే సీబీఐ రంగంలోకి దిగనుండగా.. రైల్వే సేఫ్టీ కమిషనర్ బృందం వేగవంతంగా దర్యాప్తు చేస్తోంది. బహానగబజార్ స్టేషన్‌ మాస్టర్‌ ఎస్బీ మొహంతి సహా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ లోకోపైలట్ల స్టేట్ మెంట్లను రికార్డు చేశారు. ఈ మేరకు కుట్ర కోణం ఉందా? అనే దానిపై దర్యాప్తు సాగుతోంది. సిగ్నల్‌లో మార్పులు చేయడానికి రైల్వే స్టేషన్‌లో ఆగంతకులు ఎవరైనా ప్రవేశించారా? అని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. స్థానికులను ఆరా తీస్తున్నారు.

Published : 05 Jun 2023 20:39 IST

Tags :

మరిన్ని