Viral: ‘ఎన్‌కౌంటర్ చేయబోమని రాసిస్తేనే ఆస్పత్రికి వస్తా’: పోలీసులతో ఖైదీ మంకుపట్టు

ఉత్తర్‌ప్రదేశ్‌లో నేరస్థులు, ఖైదీలు పోలీసులంటేనే భయపడిపోతున్నారు. ఎక్కడ తమను ఎన్ కౌంటర్ చేస్తారోనని వణికిపోతున్నారు. ఇందుకు అద్దంపట్టే ఘటన యూపీలోని హర్దోయి నగరంలో మంగళవారం చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఒక ఖైదీని పోలీసులు  జిల్లా జైలు నుంచి డయాలసిస్ నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరిన తర్వాత ఎన్ కౌంటర్  చేయబోనని రాసిస్తేనే తాను డయాలసిస్ చేయించుకుంటానని ఆ ఖైదీ మంకుపట్టు పట్టాడు. ఎన్‌కౌంటర్ చేయబోమని పోలీసులు ఎంత చెప్పినా సరే.. రాతపూర్వకంగా హామీ ఇస్తేనే నమ్ముతానని సదరు ఖైదీ పట్టుబట్టాడు. 

Updated : 15 Mar 2023 13:30 IST

Tags :

మరిన్ని