Cyber Crime: పార్ట్ టైం ఉద్యోగం పేరిట టోకరా.. బ్యాంకు ఖాతా నుంచి రూ.1.90 లక్షలు మాయం

పార్ట్ టైం ఉద్యోగాలంటూ మొబైల్‌కు సందేశాలు పంపిన సైబర్ మోసగాళ్లు.. ఓ యువకుడి ఖాతా నుంచి రూ.1.90లక్షలు కాజేశారు. జగిత్యాల జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కొడిమ్యాల మండలం నెమిలికొండకు చెందిన నిఖిల్ మొబైల్ ఫోన్‌కు పార్ట్ టైం ఉద్యోగం కల్పిస్తామంటూ వారం క్రితం సందేశం పంపారు. స్పందించిన నిఖిల్.. లింక్ ఓపెన్ చేసి ఆన్ లైన్‌లో తన వివరాలు నమోదు చేశాడు. మోసాన్ని గుర్తించే లోగా ఖాతాలోని డబ్బులు ఖాళీ అయ్యాయి. నిఖిల్ ఫిర్యాదుతో సైబర్ క్రైం పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Published : 07 Sep 2022 10:58 IST
Tags :

మరిన్ని