AP JAC: అందుకే మా జీతాలు ఆలస్యం చేస్తున్నారా..?: బొప్పరాజు
ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా.. జీతాలు కూడా ప్రభుత్వం సక్రమంగా చెల్లించడం లేదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు ఆలస్యమైనా రెండేళ్లుగా భరిస్తూ వస్తున్నామని, జాప్యం చేయడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. బకాయిలు అడగకూడదనే ప్రభుత్వం తమ జీతాలు ఆలస్యం చేస్తోందా అన్న అనుమానం కలుగుతోందన్నారు.
Updated : 13 Dec 2022 19:04 IST
Tags :