Delhi: దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక వాయిదా

దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టిన ఆప్‌ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు.. భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిగా భాజపా సభ్యులు కూడా ఆందోళన చేయడంతో సభలో గందరగోళం తలెత్తింది. సభ్యుల మధ్య తోపులాట చోటుచేసుకోవంతో కొందరు నేలపై పడిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఘర్షణలో భాగంగా పలువురు సభ్యులు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు.

Published : 06 Jan 2023 17:03 IST
Tags :

మరిన్ని