AAP: దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం

దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. 15 ఏళ్ల భారతీయ జనతా పార్టీ పాలనకు తెరదించుతూ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. మొత్తం 250 స్థానాలకు గానూ 134 చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ విజయఢంకా మోగించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల కంటే మెరుగ్గా రాణించిన భాజపా 104 స్థానాలు దక్కించుకుంది. పూర్తిగా చతికిలపడ్డ కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది.

Published : 07 Dec 2022 20:31 IST

Tags :

మరిన్ని