Karteeka Masam: కార్తిక సోమవారం పూజలు.. భక్తులతో శివాలయాలు కిటకిట

కార్తిక మాసం మూడవ సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పంచారామ ప్రథమ క్షేత్రం పల్నాడు జిల్లా అమరావతి అమరేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆలయంలో మహిళలు కార్తిక దీపాలను వెలిగించి.. బాల చాముండికా సమేత అమరేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గోదావరి నది వద్ద భక్తుల రద్దీ పెరిగింది. పుణ్యస్నానాలు చేసేందుకు తెల్లవారుజాము నుంచి వివిధ ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో గోదావరి నది వద్దకు కదిలి వచ్చారు. పలు ఆలయాల్లో పరమ శివుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. 

Updated : 14 Nov 2022 13:43 IST

Tags :

మరిన్ని