Macharla: మాచర్ల ఘటనపై డీఐజీ త్రివిక్రమ్ స్పందన
ఇదేం ఖర్మ నిరసన కార్యక్రమం చేస్తున్నామంటూ తెలుగుదేశం నేతలు సమాచారం ఇవ్వకపోవడం వల్లే మాచర్ల ఘటన జరిగిందని డీఐజీ త్రివిక్రమ్ వర్మ చెప్పారు. ఐతే తాము సమాచారం ఇచ్చామని.. కావాలంటే ఆధారాలు చూపిస్తామని తెదేపా నేతలు స్పష్టంచేశారు. అదే సమయంలో తెదేపా నేతల ఇళ్లు, కార్యాయాలు తగలబెట్టడాన్ని చిన్న ఘటనగా ఎస్పీ ఎలా చెబుతారని ప్రశ్నించగా.. డీఐజీ నీళ్లు నమిలారు. తెదేపా నేతలు ఆత్మరక్షణ కోసం చేసిన దాడి వీడియోలను మాత్రమే ప్రదర్శించిన డీఐజీ.. వైకాపా నేతలు కర్రలు, రాళ్లు, మారణాయుధాలతో చేసిన దాడి దృశ్యాలను మాత్రం చూపించలేదు. చట్టం తనపని తాను చేసుకుపోతుందనే మాటను మాత్రం కాస్త గట్టిగా చెప్పి మీడియా సమావేశం నుంచి వెళ్లిపోయారు.
Updated : 19 Dec 2022 13:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
C-Vigil: సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM