Hyderabad: డబుల్ డెక్కర్ బస్సులు వచ్చేశాయ్.. లుక్ మామూలుగా లేదుగా..!
హైదరాబాద్కు ఆనాటి మధుర ప్రయాణ జ్ఞాపకాలు మళ్లీ తిరిగొచ్చేశాయ్. డబుల్ డెక్కర్ బస్సులు (double decker buses) నగరంలో అడుగు పెట్టాయి. మూడు ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి కేటీఆర్ (KTR) మంగళవారం ప్రారంభించారు. ఈ నెల 11న ఫార్ములా ఈ-ప్రిక్స్లో భాగంగా.. ఈ బస్సులు ప్రధానంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ప్యారడైజ్, నిజాం కాలేజీ స్ట్రెచ్లను కవర్ చేసే రేస్ ట్రాక్ చుట్టూ చక్కర్లు కొడతాయి. ఆ తర్వాత వీటిని నగరంలో పర్యాటకాన్ని పెంపొందించడానికి హెరిటేజ్ సర్క్యూట్లో వినియోగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ బస్సులో డ్రైవర్తో పాటు 65 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. 2-2.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.
Updated : 07 Feb 2023 20:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ