Rashtrapati Nilayam: డిసెంబర్ మినహా.. రాష్ట్రపతి నిలయం ఇకపై ఎప్పుడైనా చూడొచ్చు!
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలోకి డిసెంబర్ నెల మినహా అన్ని రోజుల్లోనూ సాధారణ ప్రజలను సందర్శనార్థం అనుమతించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి నిలయంలో పునరుద్ధరించిన టన్నెల్ కిచెన్, నాలెడ్జ్ గ్యాలరీ సహా పలు గార్డెన్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్గా ప్రారంభించారు. ప్రజలందరూ రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించాలన్న రాష్ట్రపతి, గవర్నర్.. భవనం చరిత్రను తెలుసుకోవాలని సూచించారు.
Published : 22 Mar 2023 22:11 IST
Tags :